నాదెండ్లకు ఘనస్వాగతం పలికిన బత్తుల

రాజానగరం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ప్రమాదభీమా చెక్కుల పంపిణీ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గజమాలతో ఘనస్వాగతం పలికడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, భూపలపట్నం గ్రామ జనసేన పార్టీ సర్పంచ్ గుల్లింకల లోవరాజు, సూరపురెడ్డి రాజారావు, తూర్పుగానుగూడెం గ్రామ సర్పంచ్ గళ్ళా రంగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మార్పిఎస్ నాయకులు కొత్తపల్లి రఘు, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల దొరబాబు, కొత్తపల్లి బుజ్జి, బోయిడి వెంకటేష్, మోటుపల్లి శ్రీమణికంఠ తదితరులు పాల్గొన్నారు.