మిర్తిపాడులో 2వ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • జనసంద్రంగా మారిన మిర్తిపాడు గ్రామం
  • జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మికి అడుగడుగునా నీరాజనాలు పలికిన మిర్తిపాడు గ్రామ ప్రజలు

రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” కార్యక్రమం 2 వ రోజు సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో గ్రామ ప్రజల ఆదరాభిమానులతో ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకుంటూ జనసేన పార్టీ కరపత్రం ఇచ్చి ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వమని అభ్యర్దిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో మిర్తిపాడు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.