జనసేన గెలుపు కోసం పోరాడాలి: జాగరపు పవన్ కుమార్
అరకు నియోజకవర్గం: పెదబయలు మండల జనసేన పార్టీ జాగరపు పవన్ కుమార్ మండలంలోని ముఖ్య నాయకులతో బుధవారం జరిగిన వారాహి యాత్ర కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ గెలుపు కోసం మనమంతా ఒకటిగా కలిసి కష్టపడాలి, పోరాడాలని ఈ సమావేశంలో ముఖ్య నాయకులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కామరాజు, చందు, చిరంజీవి, శ్రీను, నాగరాజు, మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-15-at-2.04.49-PM-1024x842.jpeg)