రైతులకు అండగా జనసేన పార్టీ

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, అడుసుపాలెం గ్రామంలో 50 మంది రైతుల విలువైన (ఎకరా 1 – 1.5 కోట్ల) రిజిస్ట్రేషన్ అయిన 40 ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జా ప్రయత్నం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే. న్యాయం కోసం జనసేనను ఆశ్రయించిన రైతులు. గ్రామానికి వెళ్లి పరిశీలించిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓని రైతులతో కలిసి వెళ్ళి రైతుల సమస్యలను తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఎంక్వైరీ చేసి రైతుల భూములను ఆన్లైన్లో దరఖాస్తు చేసి, న్యాయం చేయాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ రైతులతో కలిసి పోరాడుతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, సురేష్, గిరీష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.