జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా వుంటుంది: ఉప్పు వెంకటరత్తయ్య
ప్రత్తిపాడు నియోజకవర్గం: ప్రత్తిపాడులోని 16వ డివిజన్ పరిధిలోని బుడంపాడు గ్రామంలో జనసేన పార్టీ బుడంపాడు విభాగం ఆధ్వర్యంలో జనసేన పార్టి కార్యకర్తలకు భరోసా నింపే ప్రక్రీయలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి అండగా వుండాలనే మంచి ఆలోచనతో ఇన్స్యూరెన్స్ పధకం ఏర్పాటు చేసినారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలకు క్రియాశీలక కిట్లును పంపిణీ చేయటం జరిగినది. ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి మద్దతు ప్రకటించిన మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటన తోటి మన జనసైనికులు, వీరమహిళలు, యువకులు, అందరూ సమిష్టిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగిందని ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు మాట్లాడుతూ మన గ్రామంలో షుమారుగా 600 మంది క్రియాశీలక సభ్యులుగా తీసుకోవటం చాలా శుభ పరిణామం అని అన్నారు. ఇదే వుత్సహం తోటి రానున్న రోజుల్లో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా మిత్రపక్షాల విజయం కోసంఅందరూ కృషి చేయగలరని ఈసందర్భంగా చింతా రేణుకా రాజు కోరినారు. 16వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు విష్ణుమెలకల ఆంజినేయలు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త మన అధ్యక్షుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అప్పుడే పార్టీ బలపడుతుందని అన్నారు. నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈకార్యక్రమాన్నికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు పార్టీ సభ్యత్వం చేయించే బాధ్యత తీసుకున్న నాయకులకు కృతజ్ఞతలు తేలియజేయుచునన్నానని కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు దాది ఆంజినేయలు, మేక జాన్ బాబు, మంచినీళ్ళ రమణ, ఆకులు సతీష్, శ్రీనివాసరావు, రాజు, నాగమల్లేశ్వరరావు, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-5.39.46-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-5.39.47-PM-1024x682.jpeg)