బీసీ హాస్టల్ దుస్థితిపై ఎంపీడీఓకు జనసేన వినతి పత్రం

గోరంట్ల లోని బీసీ హాస్టల్ పరిసరాల దుస్థితిపై శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో జనసేన నాయకులు వినతి పత్రం అందజేసారు.
గోరంట్లలోని స్థానిక బీసీ హాస్టల్ ముందు ఇరువైపులా నీటి మడుగులు ఏర్పడి పాచి నీళ్లు నిలువ ఉండటం వలన దోమలు క్రిములు తయారై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కావున సంబంధిత అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు నాగేష్, శ్రీనివాసులు, తిరుపల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.