పిడుగురాళ్లలో జనసేన ప్రజాబాట కార్యక్రమం

గురజాల: పిడుగురాళ్ల పట్టణం నాలుగో వార్డ్ లో జనసేన ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ వార్డులోనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పిడుగురాళ్ల బైపాస్ కు సంబంధించి, నెల రోజుల్లో పూర్తి చేస్తామని, క్యూబ్ సంస్థ అధికారులు తెలియజేయడం జరిగింది. క్యూబ్ సంస్థ అధికారులను పిలిపించి మాట్లాడించిన పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జనసేన పార్టీ నేతలు తెలియజేశారు.