జనసైనికుడు దినేష్ కి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేయూత

పలమనేరు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ పిఏసి మెంబర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ చేతుల మీదుగా, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిలంపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పి.ఎస్.దినేష్ గత నెల ప్రమాదవశాత్తు పాము కాటుకు గురి కావడంతో ఆసుపత్రి పాలవడం జరిగింది. జనసేన పార్టీ భీమా వలన అతనికి పవన్ కళ్యాణ్ రూపాయలు 45000/- భీమా చెక్కును జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్, మండల అధ్యక్షులు చైతన్య, జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, మండల ఉపాధ్యక్షులు కుమార్, నగేశ్ ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది.