నెల్లిపూడి గ్రామంలో కోలాహలంగా జనసేన ఆత్మీయ సమావేశం

  • నెల్లిపూడి గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

ప్రత్తిపాడు నియోజకవర్గం నెల్లిపూడి గ్రామంలో జనసేన సమావేశం కోలాహలంగా జరిగినది. ఈ సమావేశానికి జనసేన ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే రోజులన్నీ జనసేన పార్టీవని, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాబోయే పార్టీ జనసేన అని, ప్రజలకోసం పనిచేసే ఏకైక నాయకుడు మన అధినేత జనసేన పవన్ కల్యాణ్ గారే అని, ఆయనను అనుసరించే మనమంతా కూడా త్వరలోనే అధికారంలోకి వచ్చి అత్యంత భారీగా ప్రజాసేవ చేసుకుంటామని దానికి మనమంతా సన్నద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నెల్లిపూడి ప్రముఖ నాయకులు బుజ్జి మరియు వారి మిత్ర బృందం, అనుచరులు, నాయకుల అందరూ కలిసి వరుపుల తమ్మయ్య బాబు మరియు జిల్లా సెక్రెటరీ నల్లల రామకృష్ణ తో చర్చలు జరిపి రాబోయే రోజుల్లో ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లి మనం పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా అధికారంలోకి రావాలనే విషయాలను చర్చించుకోవడం జరిగింది. నెల్లిపూడి గ్రామం మొత్తం వరుపుల తమ్మయ్య బాబు జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, ప్రముఖ నాయకులు బుజ్జి, ఇతర నాయకులు, జనసేన శ్రేణులు అందరూ గ్రామ పర్యటన చేసి పార్టీ పైన ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం అధ్యక్షులు జనసేన పార్టీ పెంటకోట మోహన్, వైస్ ప్రెసిడెంట్ ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ పలివెల వెంకటేష్, యువ నాయకులు వరుపుల సాయికిరణ్ మరియు నాగసూరి, గోవిందు, నాగేశ్వరరావు మరియూ ఇతర నాయకులు శ్రేణులు ప్రజలు అందరూ పాల్గొన్నారు.