అంగన్వాడి వర్కర్స్ సమ్మెకు జనసేన మద్దతు

కొత్తగూడెం నియోజకవర్గం: అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ 4వ రోజు సమ్మెకు గురువారం జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడి టీచర్ లు సమ్మెకు పిలుపునివ్వడంతో సుజాతనగర్ నగర్ మండలం, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రాల ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సుజాతనగర్ మండలం ప్రెసిడెంట్ ఆల్వాల్ కార్తిక్, జనరల్ సెక్రటరీ కిషోర్, నవీన్, చక్రి, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, బాలకృష్ణ, ఎం. డి ఖాజా మెయిన్ పాషా, జనసేన పాల్వంచ మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సంపత్ రాం వర్మ, వల్లపు వెంకటేష్, తదితరులు వారితో పాటు సమ్మెలో కూర్చొని మద్దతు తెలిపారు. అంగన్వాడి టీచర్లకు కనీసం వేతనం 26 వేలు అందించాలని, దానితోపాటు ఉద్యోగం పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.