వి.ఆర్.ఏలకు అండగా జనసేన

  • బోనకల్ మండల వి.ఆర్.ఏలకు మద్దతుగా బోనకల్ మండల జనసేన పార్టీ కమిటీ

బోనకల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏ ఉద్యోగులు ఉన్నారు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వారి యొక్క పే స్కేల్.. అదే విధంగా 55 సంవత్సరాలు పైబడిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఓకరికి ఉద్యోగ అవకాశాన్ని మరియు ఇచిన హామీలను నెరవేర్చాలి. ఫిబ్రవరి 20- 2017 ప్రగతి భవన్లో ఇచ్చిన హామీ, మరియు, సెప్టెంబర్- 9, 2020 అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన అదే విధంగా మార్చి 22 మరోసారి ఇచ్చిన అన్ని హామీల యొక్క జీవోను వెంటనే విడుదల చేయాలి.. అదేవిధంగా వీఆర్ఏలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సకలజనుల సమ్మెలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి వీఆర్ఏల పాత్ర ఎంతో ఉందని.. వారీ చట్టబద్ధమైన సమస్యలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని.. వారి సమస్యలను పరిష్కరించనీ యెడల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వీఆర్ఏలకు అండగా ఉండి వారి యొక్క సమ్మెలో పాల్గొని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల సహాయ కార్యదర్శి ఎస్కే బాజీ బాబా, మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎస్ కే జానీ పాషా, మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ సంఘపు నరేంద్ర, మండల నాయకులు వల్లంకొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.