రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ నిరసనకు మద్దతు తెలిపిన బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిరసన 18వ రోజుకు చేరడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బొర్రా వెంకట అప్పారావు పెన్షన్ దారులను కలిసి మద్దతు తెలియజేయడం జరిగింది. బిల్డింగ్లోని ఆటో మొబైల్ షాప్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్న పెన్షన్ దారులు. బిల్డింగ్ ఖాళీ చేయమని, బిల్డింగ్ ముందు టెంట్ వేసి బైఠాయించిన పెన్షనర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని బొర్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, నాదెండ్ల నాగేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.