ప్రజల ఆకాంక్షల మేరకు రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి ఘన విజయం: పెంటేల బాలాజీ
చిలకలూరిపేట, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి ఘన విజయం సాధించాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలంలో ఉన్న చేజర్ల కపోత్వేశ్వరస్వామి దేవాలయంలో జనసేన పార్టీ సత్తెన పల్లి ఇన్చార్జి బోర్రా అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాజశ్వామల మహా చండి యాగంలో బాలాజీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాలాజీ మాట్లాడుతూ ప్రజలనుంచి జనసేన- టీడీపీ కూటమికి అపూర్వ ఆదరణ లభిస్తుందని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని తెలిపారు. సుపరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, అటువంటి పాలన జనసేన-టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నట్లు వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు రానున్న కాలంలో జనసేన-టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ ఆంధ్ర కో కన్వినర్ నిశ్శంకర శ్రీనివాస్, వీరిశెట్టి సుబ్బారావు, గురజాల నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు, ఖాసీం, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, గోపి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-09-at-17.31.20-1024x461.jpeg)