నల్ల రిబ్బన్ల సంకెళ్ళతో జనసేన – టిడిపి వినూత్న నిరసన

విజయనగరం, టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరు సరికాదని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి కోరుకొండ గ్రామంలో జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో జనసైనికులు చేతులకు నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని
శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం పైన నిర్లక్ష్యం తగదన్నారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. చంద్ర‌బాబుకి ఏ హాని జ‌రిగినా సైకో జ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్య‌త‌ అన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని, అందరూ సంయమనం పాటిస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ టిడిపి నేతలు సిరిపురపు బంగారు నాయుడు, రొంగలి కృష్ణ, వర్రి సంతోషి, అప్పల కృష్ణ, కోరుకొండ జనసేన నేతలు సిరిపురపు దేముడు, సిరిపురపు శ్రీనివాసరావు, గాదె నాగరాజు, గంట్లాన సింహద్రి నియోజకవర్గ జనసేన నేతలు డి.రామచంద్రరాజు, విసినిరిగిరి శ్రీనివాసరావు, రేగిడి లక్ష్మణరావు, కాటం అశ్విని, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, రవితేజ, రవీంద్ర, పిడుగు సతీష్, దుప్పాడ నరేష్, ఎమ్.పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, వెంకట రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.