స్థానికి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచాలని జనసేన వినతి

కొల్లేరు సరస్సులో అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుని కొల్లేరు పర్యావరణాన్ని కాపాడి, కొల్లేరులో కాలుష్యాన్ని నివారించి తద్వారా కొల్లేరులో సహజ సిద్ధంగా చేపల వేట చేసుకునే స్థానికి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచాలని, అక్రమ తవ్వకాలు మరలా పునరావృతం కాకుండా చూడాలని మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామా ఐ.ఎఫ్.ఎస్ ని కలిసి జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జనసేన నాయకులు కొఠారి అదిశేషు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు ఉప్పు కల్కి రమేష్, బొడ్డు గిరిబాబు నడిపల్లి గ్రామ జనసేన నాయకులు జుజ్జువరపు సురేష్ వినతిపత్రం అందించడం జరిగింది.