జనంతో జనసేనకు శ్రీకారం చుట్టనున్న తిరుపతి జనసేన

శుక్రవారం తిరుపతిలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ముఖ్య నేతలు అందరు సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో ఇంచార్జ్ కిరణ్ రాయల్ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నేతలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని, తిరుపతి నగరంలో ఉన్న అన్నీ డివిజన్లలో “జనంతో జనసేన” అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అండగా నిలవాలని, తిరుపతిలో రాబోయే ఎలక్షన్లలో జనసేన జెండాను ఎగరవేయాలని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషిచేసి రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ను సీఎం చేసుకొని జనసేన పార్టీ సత్తా చాటి చెప్పాలని తీర్మానించారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ వార్డు కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.