జనసేనాని జన్మదినాన కార్మిక, కర్షక, శ్రమజీవులకు ఘన సత్కారం

మైలవరం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 52వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక బ్యాంక్ సెంటర్ లో గల ఆంధ్ర పబ్లిక్ స్కూల్ ఆవరణలో నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు(గాంధీ) ఆధ్వర్యంలో కార్మిక, కర్షక, శ్రమజీవులకు, రెల్లి సోదరులకు, పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, వారు చేసిన సేవలకు గౌరవించుకుని అనంతరం భారీ కేక్ కటింగ్ ప్రోగ్రాం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఐదు మండలాల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, యర్రబోలు నరసింహారావు, శీలం బ్రహ్మయ్య, కాంతారావు, సుందరరామిరెడ్డిఉపాధ్యక్షులు గొల్లపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు, పడిగల ఉదయ్, క్రాంతి, కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, ఎర్రంశెట్టి నాని, అరిగే కళ్యాణ్, ఎర్రంశెట్టి సాయి, అశోక్ బాబీ, రాగాల నాని, సామల సుజాత, శివరాం, దూడల ఈశ్వర్, సిరిపురం సురేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.