నష్టపోయిన శెనగ రైతుకి అండగా జనసేన కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లాలో, కొండపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం ప్రతి గ్రామాన్ని పర్యటిస్తూ నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ, వారికి నష్ట పరిహారం అందిందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా బుధవారం ఉప్పలదిన్నె గ్రామంలో పర్యటించడం జరిగింది. ఉప్పలదిన్నె గ్రామంలో కొండ్రగుంట నరసయ్య అనే వ్యవసాయ రైతు 40 ఎకరాలు శెనగ వేయడం జరిగింది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షానికి 20 ఎకరాలు సెనగ పంట నష్టం జరిగింది. కొండ్రగుంట నరసయ్యకు జనసేన పార్టీ అండగా ఉంటూ, వారిని మండల వ్యవసాయ శాఖ అధికారి అయిన పూర్ణచంద్రరావు వద్దకు తీసుకొని వెళ్లి, పంట నష్టం గురించి వివరించడం జరిగింది. పూర్ణచంద్రరావు వెంటనే స్పందించి వివరాలు తెలుసుకొని, కొండ్రగుంట నరసయ్యకు ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. బుధవారం నుండి పొన్నలూరు మండలంలో ప్రతి గ్రామంలో వ్యవసాయ రైతులను పరామర్శిస్తూ వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.