అంగన్వాడి కేంద్రాల అలసత్వంపై జనసేన వినతిపత్రం

పెనుకొండ, గోరంట్ల మండలం అంగన్వాడి కేంద్రాల అలసత్వంపై తాసిల్దార్ కు వినతిపత్రం అందించి ప్రభుత్వ, అధికార నాయకుల పైన ఫైర్ అయిన జనసేన నాయకులు గోరంట్ల మండలం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు, గర్భవతులకు చిన్నపిల్లలకు కాలంచెల్లిన గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున ఎమ్మార్వోకి వినతిపత్రం అందించడం జరిగింది. తదనంతరం నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా గోరంట్ల మండలంలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో చెడిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్న కూడా ప్రభుత్వ అధికారులు గానీ ప్రభుత్వ పెద్దలు గానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అలాగే శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడంవాటిని పట్టించుకోవడం కానీ ఆ కాంట్రాక్టర్స్ పైన చర్య తీసుకోవడం గానీ ఇంత వరకు జరగలేదు అంటే అధికారులు గానీ ప్రభుత్వం గానీ గర్భవతులు, పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు సంతోష్, పెనుకొండ నియోజకవర్గ ఐటి కో ఆర్డినేటర్ యోగనంద రెడ్డి, నాయకులు రాఘవ, బాబర్, బాబా, నాగేష్, బాలు, శంకర, పులేరు, అనిల్, గౌతమ్ ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.