విద్యార్థులు చదువుల్లో పోటీ పడి, మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలి

  • కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి

అమలాపురం ఏలిమ్ ఐటిఐలో 2020-21, 2021-22 బ్యాచ్ లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందచేశారు. ప్రిన్సిపాల్ మరియు కరస్పాండంట్ జివివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో పోటీ పడి మంచి భవిష్యత్ ఎన్నుకోవాలి అన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని, ఉపాధ్యాలు చెప్పిన పాఠాలు వినాలి అని తెలిపారు. వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి – వాసు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గొలకోటి వాసు, ప్రిన్సిపాల్ జివివి సత్యనారాయణ, బి.కార్తికేయ, వీరేష్ కుమార్, ఎన్.రాజు, ఏ. గోవిందరావు, ఆర్ సురేష్, మురళి, బి. జాన్సీ, ఎమ్. సత్యనారాయణ పాల్గొన్నారు.