శ్రీమతి కోలా విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు

కనిగిరి, జనసేన పార్టీ కృష్ణా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి కోలా విజయలక్ష్మిని కనిగిరి జనసైనికులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కోలా విజయలక్ష్మి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధిపై నియోజకవర్గ సమస్యలపై, పార్టీ బలోపేతం గురించి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, కనిగిరి టౌన్ అధ్యక్షులు అంజి నాయుడు, జనసేన నాయకులు రాజేష్, సాయి కిషోర్, చరణ్, రవి అజయ్, శ్రీకాంత్ చిన్నా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.