జనసైనికుడు కులశేఖర్ రెడ్డికి ప్రమాద బీమా చెక్కు అందజేత

సత్యవేడు నియోజకవర్గం: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా: పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలానికి చెందిన క్రియాశీలక సభ్యుడు కులశేఖర్ రెడ్డికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన 50,000 వేల రూపాయల చెక్కుని జిల్లా జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, హేమకుమార్, బాటసారి, శుక్రవారం పీఏసీ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. కొద్ది నెలల క్రితం జనసైనికుడు కులశేఖర్ రెడ్డికి యాక్సిడెంట్ జరగడంతో తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయంకి సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కులశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని, ఆర్థిక సాయం చేసిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి అలాగే ప్రమాదం జరిగిన వెంటనే నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నా కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు డా: పసుపులేటి హరిప్రసాద్ గారికి, జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, హేమకుమార్ మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.