మరో రెండు కుటుంబాలను ఆదుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వ భీమా

  • మరో రెండు కుటుంబాలను ఆదుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వ భీమా

మంగళగిరి: ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ఇచ్చాపురం మున్సిపాలిటీకు చెందిన కత్తుల శంకర్ (26) ప్రమాదవశాత్తూ బైక్ ప్రమాదంలో మరణించడం జరిగింది. అతని యొక్క భార్య కత్తుల ధనలక్ష్మి గారికి 5 లక్షల చెక్కు మరియు సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గంట జనార్దన్(46) సముద్రవేటకు వెళ్తూ బోటు ప్రమాదంలో మరణించడం జరిగింది. అతని భార్య అయిన గంట నూకమ్మ గారికి 5 లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో జనసేనపార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ప్రమాద వశాత్తూ ఆ కుటుంబాలు మగ దక్షతను కోల్పోవడం వల్ల వారు ఆర్ధికం గా ఆదుకొనే వారు ఎవరు లేకుండా పోయారు అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ వారికి ఆదుకుంది అని,పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు. అలాగే పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఈ చెక్కులు వారికి రావడానికి అవసరమైన పత్రాలు సమకూర్చిన కృషి చేసిన ఇచ్చాపురం ఇంఛార్జి దాసరి రాజు, బైపల్లి ఈశ్వర్ రావు, అనపాన దుర్యోధన లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇది 5వ చెక్కు అని, జనసేన క్రియాశీలక సభ్యత్వ భీమా పేదల పాలిట వరంగా మారింది అని అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు క్రియాశీలక భీమా ప్రారంభించినటువంటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, కొర్లాం జనసేన యువ నాయకుడు చందు పాల్గొన్నారు.