కాకినాడ సిటీలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణి

కాకినాడ సిటీ: జనసేన ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు 21వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మూడవ విడత క్రియాశీల సభ్యత్వాలు కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ 21వ డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్బంగా 21వ డివిజన్ ఇన్ ఛార్జ్ మండపాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని, ప్రమాదవశాత్తు ఎవరైనా కార్యకర్త చనిపోతే వారి కుటుంబానికి ఆర్ధిక భరోసాగా ఐదు లక్షల రూపాయలు వెంటనే కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇస్తున్నారని, అదే విధంగా పార్టీలోని కార్యకర్తలందరిని తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని జనసేన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుందని జనసేన అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి నెగ్గిస్తారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జనసేన పార్టీ అభిమానులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.