ఆత్మకూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం
జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500 రూపాయలకే 5,00,000 లక్షల ప్రమాద భీమా, ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000 రూపాయలు వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలని.. ముఖ్యంగా యువకులు ఖఛ్చితంగా ఉపయోగించుకోవాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-28-at-9.16.51-PM-1024x407.jpeg)