రాజంపేట నియోజకవర్గంలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అతికారి దినేష్ అధ్వర్యంలో రాజంపేట న్యూ ఆంధ్ర పంక్షన్ హాల్ లో శుక్రవారం జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాన్, ఉమ్మడి కడప జిల్లా జనసేన సమన్వయకర్త శ్రీ సుంకర శ్రీనివాస్, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు, పార్లమెంటు అధ్యక్షులు జగన్మోహన్ రాజు, ఎద్దుల సుబ్బరాయుడు మరియు రాజంపేట జనసేన పార్టీ 6 మండలాల నాయకులు కోలటం హరికృష్ణ, రెడ్డిరాణి, కత్తి సుబ్బరాయుడు, గుగ్గీళ్ళ నాగార్జున, వేంకటేష్, కోట్టే శ్రీహరి, ఉపేంద్ర, ఓబులేష్, శంకర్, వీరయ్య ఆచారి, అబ్బిగారి గోపాల్, మెడం నాగరాజు, ఓబులయ్య, ఇందాయత్, జనసైనికులు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.