అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేసిన జనసేన

సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మల్లాం విజయ్ ఆధ్వర్యంలో ఉయ్యాల ప్రవీణ్ సూచనలు మేర చెంబేడు గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు పాల్గొన్నారు.