జనసేనాని ఆదర్శంగా రాజాంలో రైతు భరోసా

రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం, నాయిరాలవలస గ్రామపంచాయతీలో పరిధిలో గల రెడ్డి పేట గ్రామంలో, కౌలురైతుల కోసం పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను స్ఫూర్తిగా తీసుకొని, గ్రామంలోని సెంటు భూమిలేని 7 గురు కౌలు రైతులకు, ఒక్కొకరికి 5000 రూపాయాలు పెట్టుబడి సాయంగా రెండో విడతగా ఆదివారం “వావిలపల్లి కిరణ్” ఆర్థిక సాయం చేయడం జరిగింది. మొదటి విడతలో నాయారాలవలస గ్రామంలో పది మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి గతంలో 5,000 చొప్పున కౌలు రైతు భరోసా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వావిలపల్లి కిరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని, ప్రతి జనసైనికుడు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజుతో పాటు అన్నంనాయుడు, కె.వి.ప్రవీణ్, గోవిందు, అప్పల నాయుడు, ప్రసాద్, హేమంత్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.