గ్రంధాలయానికి మోక్షం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిన జనసేన

బొబ్బిలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ సంచాన మరియు జనసేన పార్టీ నాయకులు మంగళవారం గ్రంధాలయాన్ని సందర్శించి చూసేసరికి ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకు అంటే గత మూడు నెలల క్రిందట జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గ్రంధాలయనికి కనీసం వసతులు లేవు, సరైన భవనం లేదు, పుస్తకాలు కూడా లేవు అని తక్షణమే పనులు చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఆరోజు హెచ్చరిస్తే కంటి తుడుపు చర్యగా మున్సిపాలిటీ కమిషనర్ వచ్చి పనులు మొదలు పెడతాము అని చెప్పి ఉన్న ఆ రేకులు కూడా తీపించి ఈరోజుకి 3 నెలలు అవుతున్నా ఒక్క ఇటుక కూడా అక్కడ పడలేదు అని, ఇదేనా మీ పనితీరు అని ఆరోజు అంత గాంభీర్యంగా పనులు చేసి చూపిస్తాం అని ప్రగల్బాలు పలికిన స్థానిక ఎమ్మెల్యే శంబంగి ఈరోజు వరకు ఎందుకు పట్టించుకోలేదు అని జనసేన నాయకులు దుమ్మెత్తిపోశారు. మీరు కనుక 2 రోజుల్లో పనులు మొదలు పెట్టకపోతే జనసేన పార్టీ తరపున బాబు పాలూరు ఆధ్వర్యంలో నిరాహార దీక్షకి కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యువ నాయకులు రాజా పళ్లెం, యిందువ సత్యనారాయణ, రాజా జగన్, రేవళ్ల కిరణ్, పోతల శివశంకర్, అలజంగి సంతోష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.