పొన్నూరు నియోజకవర్గంలో జనసేన ఆత్మీయ సమావేశం

పొన్నూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు అధ్యక్షతన జనసేనపార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన మండల అధ్యక్షులు మరియు కమిటీల సబ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. జనసేనపార్టీ వీరమహిళ యెన్నం ద్రాక్షాయని ఇటీవల ఆకాలమరణం చెందినారు. పొన్నూరు నియోజకవర్గ కార్యకరల ఆత్మీయ సమావేశంలో స్వర్గీయ ద్రాక్షాయని చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కమాల్, విజయ్ శేఖర్, వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.