34వ డివిజన్ లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ: కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన పార్టీ 34వ డివిజన్ సినిమా రోడ్డు ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కాకినాడ సిటీ కార్యదర్శిముత్యాల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ అప్రతిహతంగా భీం యాత్రని కాకినాడ సిటిలో జరుపుతున్నామనీ త్వరలో అంబేడ్కర్ గారి స్మారకస్థూపం వద్దకు ఈ సేకరించిన కలశాలతో వెళతామన్నారు. ఈసందర్భంగా వారు స్థానిక దళితులతో మాట్లాడుతూ బ్యాక్ లాగ్ పోస్ట్ లని ఈ వై.సి.పి ప్రభుత్వం నియామకాలని పక్కన పడేసి దళిత నిరుద్యోగులని మోసం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులు తమ విలువైన కాలాన్ని కోల్పోతున్నారనీ ఇది నొరుతొ నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉందని ఈ ముఖ్యమంత్రికి త్వరలో బుద్ధి చెప్పే రోజుందని ఎద్దేవా చేసారు. ఎలా అభిమనంతో అధికారాన్ని ఇచ్చామో అలాగే తీసేసుకునేందుకు సిద్ధంగ ఉన్నామన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, బండి సుజాత, ముత్యాల దుర్గ శివకుమారి, యేలేటి సోనీ ఫ్లోరెన్స్, సబ్బే దీప్తి, బోడపాటి మరియ, బట్టు లీల,చోడిపల్లి సత్యవతి, తానంచింతల రమ్య, తానంచింతల జాషువా, రమణమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.