ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటిలోని స్థానిక రామారావుపేట శివాలయం వీధి నుండీ బండి సుజాత ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో బుధవారం జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకిరామారావు మాట్లాడుతూ అమాయకులైన దళితులని ఈ వై.సి.పి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రకరకాల వాగ్దానాలతో మభ్యపెట్టి తీరా అధికారం సాధించాకా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఎంత దారుణమంటే దళితులపై దాడులు చేసి తిరిగి వారిపై తమపార్టీలోని అమాయక దళితులతో ఎస్.సి & ఎస్.టి కేసుని బనాయించి కటకటాల పాలు చేస్తోందని ఇంతకన్నా విడ్డూరం లోకంలో ఇంకేమీ లేదన్నారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందనీ, అందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ సిటి వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, బండి సుజాత, భవాని, బోడపాటి మరియ, బట్టు లీల, జనసేన నాయకులు ఆకుల శీను, వెంకటేశ్వర్లు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.