హుజురాబాద్ లో జనసేనాని జన్మదిన వేడుకలు

హుజురాబాద్, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన వేడుకల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల్ గూడూర్ గ్రామంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణి మరియు బాణా సంచాలు పేల్చడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు పల్లె మహేష్ గౌడ్ పాల్గొన్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గట్టు నారాయణ అరవింద్ బుర్ర అజయ్ శ్రీనివాస్ నిఖిల్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.