ఐరాల జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో మండల అధ్యక్షులు పురుషోత్తం యువ నాయకులు మైలారి వినయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా300 మంది జనసైనికులు హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ చాలా పటిష్టంగా ఉందని, అందుకు నిదర్శనంగా ఘనంగా నిర్వహిస్తున్న సేనాని పుట్టినరోజు వేడుకలు అని అన్నారు. రాబోవు ఎన్నికలలో జనసేన ప్రభుత్వం స్థాపిస్తామని ప్రజలకు అండగా ఉంటామని తెలియజేశారు. అతిథులుగా కార్యదర్శి శివయ్య, యాదమరి మండల అధ్యక్షులు కుమార్, తవణంపల్లి మండల అధ్యక్షులు శివ, మండల ఐటీ కోఆర్డినేటర్ సాయి, హాజరయ్యారు. నాగంవాండ్ల పల్లి మండల పంచాయతీ నుండి పృథ్వీరాజ్ 50 మంది సైనికులతో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐరాల మండల ఉపాధ్యక్షులు సానే నవీన్, చందు ప్రధాన కార్యదర్శి వాసు రాయల్, తులసి బాబు, రోహిత్, మోహన్ బాబు, అమీన్, కిరణ్, శివ, హరి కాణిపాకం, విశ్వతేజ, మోహన్, అజయ్, నవీన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-7.53.16-PM-1024x456.jpeg)