నిరాశ్రయులైన కుటుంబానికి ఇళ్ళు నిర్మించి ఇచ్చిన జనసేన

ధవళేశ్వరం గ్రామంలో అనుకోని విపత్తులతో ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన కుటుంబానికి జనసేన అండగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్ మరియు తదేకం ఫౌండేషన్, అలాగే షేక్ అమీనా సౌజన్యంతో నూతనంగా వారికి ఇల్లు నిర్మించడం జరిగింది. శనివారం కందుల దుర్గేష్ జన్మదిన సందర్భంగా ఆ ఇంటిని గృహప్రవేశం చేయించి లబ్ధిదారులకు ఆయన స్వహస్తాలతో ప్రారంభించి అందజేస్తూ నిరాశ్రయులైన వారికి జనసేన అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అమీనా ఆహ్వానం మేరకు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు, ఏడిద పల్లఒరాజు, జనసేన నాయకులు, ధవలేశ్వరం గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.