నాదెండ్ల మనోహర్ దివిసీమ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ మండలం, అవనిగడ్డ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి అధ్యక్షులు మరియు ఉమ్మడిరాష్ట్ర మాజీ శాసనసభ సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ నెల 27 వ తేదీన దివిసీమకు వస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం చేయాలని గురువారం అవనిగడ్డ ఆర్య వైశ్య కల్యాణమండపంలో జరిగిన విలేకర్ల సమావేశంలో పిలుపు ఇవ్వటం జరిగింది.ఈ నెల 27 అవనిగడ్డలోని ఆర్య వైశ్య కల్యాణమండపం నందు ఉదయం 11 గంటలకు నియోజకవర్గ జనసేన క్రియాశీల కార్యకర్తలకు సభ్యత్వ పత్రాలు మరియు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు, ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అవనిగడ్డ మండలంలోని 10 గ్రామ పంచాయతీలో ఉన్న జనసేన కుటుంబం, నియోజకవర్గం జనసేన కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అవనిగడ్డ సభని విజయవంతం చేయాలని, జనసేన కుటుంబం పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇవ్వటం జరుగుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు అనేక సమస్యలు ఉన్నాయని ఆసమస్యల్ని పట్టించుకునే నాదుడే కారువైయ్యారని తెలిపారు. ముఖ్యంగా కోడూరు, నాగాయలంక మండలాలలోని తీరప్రాంత రైతులు సరి అయిన డ్రైనేజీ సదుపాయాలు లేక వర్షలకు నాటు వేచిన వరి పొలాలు సైతం కుళ్ళి పోయిన నేటికీ ఆ రైతులు పరిస్థితి పట్టించుకొనే నాయకుడు లేదు అనీ, అలాగే నియోజకవర్గంలో అన్ని ప్రధాన రోడ్డులు అద్వాన పరిస్థితిలో ఉన్నా పట్టించుకోకపోవటం చాలా బాధాకరం. అదే విదంగా రాష్ట్రంలో మాట తప్పం మడం తిప్పం అనే నినాదంతో ఉండేవారు శాసన మండలి రద్దు చేయడఒ మరలా దానిని రద్దు చేయడం. అమరావతి రాజధాని ఏర్పాటును రద్దు చేయడం మరల దానిని రద్దు చేయాలని బిల్లు ప్రవేశపెట్టడం ఏమిటని మొత్తం మీద ఈ రాష్ట్రంలో పరిపాలనే రద్దు అయ్యేటట్లే ప్రస్తుత పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు, రాజనాల వీరబాబు,కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయడు, ఎంపీటీసీలు భాను, వసంత్ కుమార్, పప్పుశెట్టి శ్రీనివాస్, అన్నపరెడ్డి ఏసుబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.