సంగం గ్రామంలో ఇంటింటికి జనసేన ప్రచారం

కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ మండలంలోని సంగం గ్రామంలో జనసేన పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో ఏ కష్టం వచ్చినా జనసేన అండగా ఉంటుందని అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలెక్షన్స్ లో జనసేన పోటీ చేస్తున్నందున్న ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం అధ్యక్షుడు ఓలపల్లి రాంబాబు, పాల్వంచ మండలం ఉపాధ్యక్షుడు సంపత్, పాల్వంచ మండలం జనరల్ సెక్రటరీ దేవా గౌడ్, నాగరాజు తదితరులు మరియు కొత్తగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ పాల్గొన్నారు.