GVMC సులభ కాంప్లెక్స్ వర్కర్స్ కు జీతాలు అందేలా చేసిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు గంగవరం నాలుగు గ్రామాల్లో ఉన్న సులభ కాంప్లెక్స్ వర్కర్స్ కు జీ.వీ.ఎం.సీ రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని జనసేన నాయకులు 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డిని కలిసి తమ బాధలను తెలియజేయడంతో జీ.వీ.ఎం.సీ అధికారులతో మాట్లాడి జీతాలు ఇప్పించడం జరిగింది కార్పొరేటర్ గోవింద్ రెడ్డి జీ.వీ.ఎం.సీ కౌన్సిల్ సమావేశంలో సులభ కాంప్లెక్స్ వర్కర్ పడుతున్న బాధలను అధికారులకు తెలియజేయగా తక్షణమే స్పందించి జీతాలు ఇచ్చినందుకు జీ.వీ.ఎం.సీ అధికారులకు, ప్రజా నాయకుడు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద రెడ్డికి సులభ కాంప్లెక్స్ వర్కర్స్, గ్రామ ప్రజలు ప్రత్యేకించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎరిపిల్లి నూకరాజు, చోడిపిల్లి ముసలయ్య, మెగా నూకరాజు, ఏరిపిల్లి రాజబాబు, బడి మంగవేణి, అప్పారావు తాతారావు, ధనరాజు తదితరులు పాల్గొన్నారు.