మంచినీళ్ళ బోరు బాగుచేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గ్రామం పేర్ల అమ్మోరు చాలా కాలము నుండి మంచినీళ్ళ బోరు పనిచేయుటలేదని 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఫిర్యాదు చేశారు. బుధవారం పేర్ల అమ్మోరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమస్య చెప్పగానే 24 గంటల్లో పని పూర్తయింది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య చేశారు. ఈ కార్యక్రమంలో ఎరిపిల్లి మెగా నూకరాజు పి.చంటి, అమ్మోరు, భూలోక తదితరులు పాల్గొన్నారు.