పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన డిమాండ్

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్నా జానకిరామ్ పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కలిసి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్సకార వికాస విభాగంరాష్ట్ర కార్యదర్శి రాజు, కొత్తపట్నం మండల నాయకులు ఏడుకొండలురెడ్డి, శ్రీకాంత్, నరసింహ, బాబురావు, రాము తదితరులు పాల్గొన్నారు.