గిరిజనులకు మంచినీరు సదుపాయం కల్పించాలని జనసేన డిమాండ్

జనంగుడ గ్రామంలో కుళాయి నిర్మాణం త్వరగా చేపట్టి.. గిరిజనులకు మంచినీరు ఇవ్వాలని ఎం.పీ.డీ.ఓ కి వినతి.

అరకు వ్యాలీ మండలం, కొత్త బళ్ళు గూడ పంచాయతీ పరిధిలో గల జనం గూడా లో కుళాయి నిర్మాణం త్వరగా చేపట్టి గిరిజనులకు మంచినీరు సదుపాయం కల్పించాలని, జనసేన ఎక్స్ ఎం.పి.టి.సి సాయి బాబా, రామకృష్ణ సోమవారము ఎంపీడీవో ఆఫీసు వద్దకు వెళ్లి ఎం.పీ.డీ.వో గారిని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీనికై ఎం.పి.డి.ఓ స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను క్లుప్తంగా వివరించగా.. పది రోజుల్లో కుళాయి నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో గిరిజనులకు మంచి నీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎక్స్ ఎం.పి.టి.సి సాయి బాబా, దురియా, అల్లంగి రామకృష్ణ పాల్గొన్నారు.