రుద్రవరం జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

కోడుమూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నియోజకవర్గాల ప్రజలకు జగనన్న ఇళ్ల పట్టాలు 20 వేల పైచిలుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వము మౌలిక వసతులు కోసం 89 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. లబ్ధిదారులకు మౌలిక వసతుల కోసం రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంధాలయాలు, అంగన్వాడీలు కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవేమి ఇక్కడ కల్పించడం లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆకెపోగు రాంబాబు, లక్ష్మన్న, కృష్ణ బాబు, షాలు భాష, ముళ్ళ మహబూబ్ బాషా, ముల్లా రహిమాన్, కుమార్, జాన్ కోడుమూరు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.