Kadapa: కమలాపురం ఇంటింటి ప్రచారంలో జనసేన

కడపజిల్లా కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను బరిలోకి దించింది. 4వ వార్డు నుంచి శ్రీ ఆరిఫ్, 8వ వార్డు నుంచి శ్రీ రమేష్, 9వ వార్డు నుంచి శ్రీ నాగేంద్ర, 12వ వార్డు అభ్యర్ధిగా శ్రీ సిద్ధులు గాజు గ్లాసు గుర్తుపై పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఉపసంహరణ గడువు ముగియడంతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనసేన అభ్యర్ధులకు మద్దతుగా పార్టీ జిల్లా నాయకత్వం రంగంలోకి దిగింది. కడప నియోజకవర్గం ఇంఛార్జ్, రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ శ్రీ సుంకర శ్రీనివాస్ అభ్యర్ధులతో కలసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఓటు ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ దాదా పీర్, శ్రీ అర్జున్, శ్రీ షరీఫ్, శ్రీ నవీన్, శ్రీ రామ్ సిద్ధూ, కడప టౌన్ నాయకులు శ్రీ మాలే శివ, శ్రీ సురేష్, శ్రీ విస్సూ, శ్రీ నాగరాజ్, శ్రీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.