టెన్త్ ఫలితాల్లో టాపర్ గా నిలచిన విద్యార్థులకు జనసేన ప్రోత్సాహం

  • జనసైనికులుకు సన్మానం, క్రియశీలక కిట్ల పంపిణి

పశ్చిమ నియోజకవర్గం 91వార్డ్ పాత గోపాలపట్నంలో జనసేన నరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా కష్టపడిన జనసైనికులుకు సన్మానం చేసి క్రియశీలక కిట్ల పంపిణి మరియు ఊరిలో 10వ తరగతి అత్యదిక మార్కులు సాధించిన విద్యార్థులకు జనసేన ప్రోత్సాహం అందించడం జరిగింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పశ్చిమ నియోజకవర్గం 91వార్డ్ పాత గోపాలపట్నంలో కష్టపడిన జనసైనికులుని భరత్, మని, అప్పలరాజు, గిరి, నవీన్, సాయి, నాయుడు లను గుర్తించి వారికి సన్మానం చేసి జనసేన షిల్డ్ లను.. క్రియ శీలక కిట్లను అందించడం జరిగింది. అదేవిదంగా ఊరిలో గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొని అత్యధిక మార్కులు సాధించిన మునసా అలేఖ్య, నిఖిత, నమ్మి హర్షిత విద్యార్థునులకి వారి పై చదువుల ప్రోత్సాహంగా ఒక్కొక్కరికి 5000/- రూపాయలను మరియు పుస్తకాలను బహుకరించడం జరిగింది. ఈ సందర్బంగా సంగం నరేంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కష్టపడే జనసైనికులుని గుర్తించి వాలని గౌరవించండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.. అందులో భాగంగానే ఈ రోజు ఏమి ఆశించకుండా జనసేన కోసం కష్టపడిన జనసైనికులును సన్మానించుకొని గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. అలానే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు మీరు అనుకున్న లక్ష్యలాను సాధించి సమాజానికి ఉపయోగ పడాలని తెలియజేసారు.. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన బొడ్డేపల్లి రఘు, అంగ దుర్గా ప్రశాంతి, పీలా రామకృష్ణ, ఎన్.అర్.ఐ గంగాధర్ కి అలానే కార్యక్రమానికి సహాయం చేసిన ఎన్.అర్.ఐ గంగాధర్, ఆనంద్, రవి, మెడికల్ షాప్ రాజు, వీర మహిళా లత, భరత్ మరియు మిగతా వార్డు లో ఉండే ముఖ్యమైన నాయకులు, జనసైనికులుకి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకున్నారు.