ఆనందరావు కుటుంబానికి జనసేన ఆర్దిక సాయం

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన గోర్లె ఆనందరావు జనవరి 17వ తేదిన అనారోగ్యంతో మరణించారు. ఆయనకు నీలవేణి(11), మౌనిక(15) ఇద్దరు కుమార్తెలు, ఆ పిల్లలకు తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. వారిది పేదకుటుంబం కావడంతో జనసేన మండల నాయకులు గోర్లె సూర్య ఆకుటుంబానికి 5000/ అర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, జనసేన సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు, జనసైనికులు గుడివాడ దుర్గ, అభి, గొర్లె రమణ తదిత రులు పాల్గొన్నారు.