కిడ్నీ వ్యాధి బాధితునికి ఆర్థిక సహాయం చేసిన జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలం, వెల్దూరు గ్రామానికి చెందిన యువకుడు జీరు శివకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. చాలా పర్యాయాల డయాలసిస్ చికిత్స అనంతరం వైద్యులు తనకు కిడ్నీ మార్పిడి అత్యవసరమని తెలిపారు. దాంతో వేరే దారి లేక ఆర్థికంగా వెనుకబడిన తనకు తన తండ్రి కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ చేసారు. వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు జలపారి అప్పడుదొర(శివ), సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్ చేతులమీదుగా 20వేల రూపాయలు ఆ యువకునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నాయకులు కొయ్య ఎల్లయ్య రెడ్డి కంబాపు పోతయ్యరెడ్డి, తోటరెడ్డి, లక్ష్మణ్, కొలచిన రమేష్, మాదేటి ఈశ్వర్రావు‌, జానకీరామ్, బీరక నరేష్‌, దనుంజయ, దేశెట్టి వంశీకృష్ణ, జగదీష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.