Gokavaram: ‘పాటంశెట్టి’ లక్ష మొక్కలు నాటడం అభినందనీయం: జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్

ప్రజల్లో మార్పు తీసుకు రావడం కోసమే సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ స్థాపించారని జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. గోకవరంలోని సూర్య కళ్యాణ మండపంలో జనసేనపార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఓటమి చెందుతామని తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీలతో పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. లంచగొండితనం అవినీతికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి జనసేనపార్టీ ముందు ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆ పార్టీ ఇంచార్జి లక్ష మొక్కలు నాటడం అభినందనీయం అని అన్నారు. అదేవిధంగా గోకవరం నుండి రంప యర్రంపాలెం వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ రహదారి మరమ్మతు పనులను కందుల దుర్గేష్ పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీ కార్యకర్తలతో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న జనసేన సైనికులను కందుల దుర్గేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాటంశెట్టి సూర్యచంద్ర, వరుపుల తమ్మయ్యబాబు, తుమ్మల బాబి, దాసరి రాధాకృష్ణ, పాటంశెట్టి శ్రీదేవి, కడియపులంక రాజేశ్వరి, బుద్ధిరెడ్డి శ్రీనివాస్ ,దోసపాటి సుబ్బారావు ఉంగరాల మణిరత్నం, ప్రగడ ప్రభ ఉంగరాల శివాజీ తదితరులు పాల్గొన్నారు.