గోవిందపురం గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 595వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 595వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం, గోవిందపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 650 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 98860 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 596వ రోజు కార్యక్రమాన్ని గురువారం గోకవరం మండలం, టాకూర్ పాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి తెలిపారు. బుధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తుమ్మల ఫణీంద్ర, గోవిందపురం నుండి కమ్మిల సతీష్, పాటంశెట్టి వెంకట్రావు, పాటంశెట్టి బాలు, చందక నాని, వైబోయిన లోవరాజు, కరణం వీర వెంకట రమణ, వేమగిరి సురేష్, ఉల్లంపర్తి ప్రసాద్, తుమ్మల స్వామి మనోజ్, రామిరెడ్డి రామయ్యకాపు, సగరపేట నుండి గండికోట బాల బాలాజీ, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జన్నాధపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కింతాడ సింధు రాజ్ కుటుంబ సభ్యులకు, కుక్కా పవన్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక పాటంశెట్టి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు.