జిల్లెలగూడ గ్రామంలో జనం కోసం జనసేన

జీలుగుమిల్లి మండలం, జిల్లెలగూడ గ్రామంలో ఆదివారం జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఆ గ్రామంలోని వారి ముఖ్య సమస్య ఈ గ్రామానికి సరైన రోడ్లు లేక అత్యవసర పరిస్థితుల్లో.. చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం అధికారం లోనికి వచ్చినా అభివృద్ధి మాటలకే పరిమితం అవుతుంది. కానీ ఎవరూ రోడ్లు వేయించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ తరఫున జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి గ్రామానికిరోడ్డు రోడ్లు వేస్తామని నాయకులుహామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామంలోని ప్రజలు ఇల్లు లేక పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గానీ.. ప్రజా ప్రతినిధులు గానీ వీరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గత రెండు రోజుల ముందు ఈ గ్రామం పక్కన మీటింగ్ ఏర్పాటు చేసి.. జిల్లెలగూడ గ్రామం రాకుండా సాకు చెప్పి వెళ్లిపోయాడని గ్రామస్తులు వాపోయారు. ఈ సమస్యలపై జనసేన పార్టీ తరఫున తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, వీరంకి వెంకటేశ్వరరావు, సరియ ముత్యాలరావు, రాజు, కే రమేష్, ముత్యాలరావు ఆ గ్రామ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.