బలమైన శక్తిగా జనసేన నిర్మాణం: కోన తాతారావు

గాజువాక, ప్రజా సమస్యలపై అవగాహనతో జనసేన ప్రజల పక్షాన పోరాటం చేయటానికి పార్టీ శ్రేణులు సిద్దంగా వుండాలని అందుకు పార్టీ సభ్యత్వం నమోదుకు ఎక్కువ శ్రద్ద చూపాలని శనివారం పాత గాజువాక జంక్షన్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరంలో కోన తాతారావు అన్నారు. వైసిపి పాలనలో పాలు దగ్గర నుంచి చెత్త వరకు పన్నులు పెంచుకుంటూ వెళుతుంటే సామాన్యులు దిక్కు తోసని స్థితిలో వున్నందున వారికి జనసేన అండగా ఉండాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరాన్ని ప్రజలు కోరకుంటున్నందున యువకులు స్వచ్ఛందంగా మెంబర్ షిప్ తీసుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవింద రెడ్డి, కరణం కనకారావు, లంకల మురళి దేవి, రౌతు గోవింద, ముమ్మనా మురళి, భార్గవ్, మూర్తి, శాలిని, కళావతి, వంశీ, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.